ఎన్టీఆర్, చిరుల తర్వాత కళ్యాణ్ రామ్ తేజూలే…!
కొన్ని
రోజుల క్రితం మెగా నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి నటించే ఒక మల్టి స్టారర్
సినిమా రాబోతోంది అని వార్తలు వచ్చాయి. డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి
ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడని, నందమూరి కళ్యాణ్ రామ్–
సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా ఈ మల్టి స్టారర్ సినిమా కు కథ తయారు
చేస్తున్నాడని టాక్ వినిపించింది. ఫిలిం నగర్ నుంచి వస్తున్న ఫ్రెష్
అప్డేట్ ప్రకారం ఆ ప్రయత్నాలు మెటీరియలైజ్ అయ్యే దిశగా మరో అడుగు పడిందట.
ఈమధ్యనే రవి కుమార్ చౌదరి ఇద్దరు హీరోలని కలిసి కథ వినిపించడం, వాళ్ళు
గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయట.
ఈ సినిమాను సీనియర్ నిర్మాత KS రామారావు
ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాడట.అంతలోనే ఒక హీరోయిన్ గా రెజీనా ను
ఫైనలైజ్ చేశారట. మరో హీరోయిన్ ను త్వరలో ఫైనలైజ్ చేస్తారట. మెగా నందమూరి ఫ్యామిలీ
హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా కు అనౌన్స్మెంట్ రోజునుంచే భారీ
హైప్ వస్తుందనడం లో సందేహం లేదు. ఈ సినిమా కనుక సెట్స్ పైకి వెళ్తే
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిల(ఎన్టీఆర్,
చిరంజీవి తిరుగులేని మనిషి సినిమాలో కలిసి నటించారు) తర్వాత ఈ జెనరేషన్
లో మెగా, నందమూరి హీరోలు కలిసి నటించే మొదటి సినిమా అవుతుంది !
No comments:
Post a Comment