ఫారిన్ ఫ్లైట్ ఎక్కిన 'సరైనోడు' టీమ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సరైనోడు’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ని పూర్తి చేసుకొన్న 'సరైనోడు' టీమ్ తాజాగా ఓ పాట చిత్రీకరణ కోసం సౌత్ అమెరికాలోని బొలీవియాకి వెళ్ళింది. ఈ విషయాన్ని అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ద్వారా తెలిపింది. ఈ చిత్రంలోని పాటల్ని బొలీవియాలోని ఓ ప్రత్యేక దీవిలో చిత్రీకరించబోతున్నారట. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు మళ్ల దీవి ఇదే కావడం విశేషం. బొలీవియాలో తీయబోయే పాటలతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని, మార్చి నెలాఖరులో ఆడియో వేడుక ఉండవచ్చని, ఏప్రిల్లో సినిమా విడుదలవుతుందని రకుల్ వెల్లడించింది. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్గా మెప్పించనున్నారు.
No comments:
Post a Comment